తెలంగాణ

telangana

ETV Bharat / state

సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లా కేంద్రంలో సంచార శౌచాలయాలను ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ ప్రారంభించారు. నగరానికి వచ్చే మహిళలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

By

Published : Jul 19, 2020, 1:55 PM IST

minister  Puvvada  started mobile toilets
సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

వివిధ పనుల నిమిత్తం ఖమ్మం నగరానికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడకుండా సంచార టాయిలెట్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద నేడు ఏడు సంచార శౌచాలయాలను ఆయన ప్రారంభించారు.

నగరంలో 4 వాహనాలు తిరుగుతాయని.. 3 వాహనాలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీటితో పాటు మంత్రి కేటీఆర్​ సూచన మేరకు నగరంలో సుమారు 140 మూత్రశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.

సంచార శౌచాలయాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఇదీచూడండి: కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details