తెలంగాణ

telangana

ETV Bharat / state

కూసుమంచి ప్రకృతి వనంలో మొక్కలు నాటిన పువ్వాడ - Minister Puvvada

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనానికి నిలయాలని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ప్రకృతి వనంలో ఆయన మొక్కలు నాటారు.

minister puvvada plantation in kusumaanchi prakruthi vanam
కూసుమంచి ప్రకృతి వనంలో మొక్కలు నాటిన మంత్రి పువ్వాడ

By

Published : Jul 20, 2020, 9:36 PM IST

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రకృతి వనంలో మంత్రి పువ్వాడ అజయ్​ మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రకృతి వనంలో నాటిన మొక్కలను బాధ్యతగా పెంచి మహా వృక్షాలుగా తీర్చి దిద్దాలని సిబ్బందికి సూచించారు. మంత్రితో పాటు ఎమ్మెల్య ఉపేందర్​ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​ కూడా మొక్కలు నాటారు.

ABOUT THE AUTHOR

...view details