ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో మద్దులపల్లి గిరిజన సంక్షేమ భవన్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా కేర్ సెంటర్ను ప్రారంభించారు. కరోనా వచ్చిన వారికి అత్యవసర సేవల కోసం ఈ కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కరోనా కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ - ఖమ్మం జిల్లా వార్తలు
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా కేర్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బాధితుల కోసం వంద పడకల కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
![కరోనా కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ Minister Puvvada Inaugurates Corona Care Center In Paleru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8103423-1046-8103423-1595258697592.jpg)
కరోనా కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ
సుమారు వంద పడకలతో ఈ కేర్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు చికిత్స అందించనున్నట్టు, ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు. కరోనా లక్షణాలు ఉండి ఇంటిదగ్గర సౌకర్యంగా లేనివారికి వైద్యం చేసి మందులు. పోషకాహారం ఇస్తున్నామన్నారు. కరోనా వచ్చినా.. ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని మంత్రి ప్రజలకూ సూచించారు.
ఇదీ చదవండి:నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!