తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతిపై విచారణకు నేను సిద్ధం.. మరి మీరు: మంత్రి పువ్వాడ - బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం

ఖమ్మం ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సమీకృత మార్కెట్‌ను మంత్రులు పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఖమ్మం పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై పువ్వాడ స్పందించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమని అన్నారు.

minister-puvvada-ajay-and-niranjan-reddy-inaugurated-integrated-market-in-khammam-district
నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దం: మంత్రి పువ్వాడ

By

Published : Jan 10, 2021, 6:56 PM IST

నాపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్దం: మంత్రి పువ్వాడ

ఖమ్మంలో త్వరలో జరిగే నగరపాలక సంస్థ ఎన్నికల్లో అసలైన వ్యాక్సిన్ దెబ్బ రుచిని భాజపాకు చూపిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఖమ్మం పర్యటనలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఇప్పటి వరకు తనకు అవినీతి మరక అంటుకోలేదని... భవిష్యత్ లోనూ అంటుకోదని స్పష్టం చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమని అన్నారు. ఖమ్మం ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సమీకృత మార్కెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఎన్‌ఎస్‌పీ క్యాంపులో సమీకృత మార్కెట్ ప్రారంభించిన మంత్రులు

ఎన్నికల సమయంలో రాజకీయ పర్యటకులు వస్తుంటారని... భాజపా నేతలు వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపినందుకు భాజపా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఇప్పటివరకు స్పందనే లేదన్నారు.

ఖమ్మం నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వచ్చే నెలలో టేకులపల్లిలో రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఖమ్మం సమీకృత మార్కెట్‌కు రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ఐటీహబ్‌, మినీట్యాంక్‌బండ్‌లు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు పువ్వాడ వివరించారు. రైతులకు నాణ్యమైన ధర రావడంతో పాటు అన్ని హంగులతో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:సంక్రాంతికి కరకరలాడే జంతికలను చేసుకోండిలా..

ABOUT THE AUTHOR

...view details