తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 11:59 AM IST

ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలకు బత్తాయి పండ్ల పంపిణీ

కరోనాతో కష్టకాలంలో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతకూలీలకు ఉపాధి హామీ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Minister Puvada Ajay kumar Distribute in Battai Fruits in Khamamm district
ఉపాధి హామీ కూలీలకు బత్తాయి పండ్ల పంపిణీ

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఉపాధి పనులు చేస్తున్న 35 వేల మంది కూలీలకు బత్తాయి పండ్లు, ఓఆర్​ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, మాస్కులు, కూరగాయలను మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పంపిణీ చేశారు. సత్తుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కూలీలకు అందజేశారు.

ఓవైపు ఎండలు మరోవైపు లాక్​డౌన్​తో ఇబ్బందుల్లో ఉన్న కూలీలకు చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఉపాధి హామీ పనులు చేసే సమయంలో కూలీలు భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని మంత్రి పువ్వాడ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details