ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కరోనా రోగుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వార్డును జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు.
ఖమ్మంలో ఒక్క కరోనా కేసు లేదు: మంత్రి పువ్వాడ - minister puvvada ajay kumar latest news
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకుఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డును జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి పరిశీలించారు.
![ఖమ్మంలో ఒక్క కరోనా కేసు లేదు: మంత్రి పువ్వాడ Minister Pawwada Ajay Kumar examines the corona ward](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6668310-thumbnail-3x2-corona-rk.jpg)
ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డును పరిశీలించిన మంత్రి
ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో 50 ఐసీయూ పడకలతో పాటు 70 సాధారణ పడకలు సిద్ధం చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని... కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వెయ్యి పడకలతో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డును పరిశీలించిన మంత్రి
ఇవీ చూడండి:ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి
TAGGED:
khammam latest news