ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నియామకం చేపట్టాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. సంబంధిత సిబ్బంది నియామకంతో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
ఆస్పత్రి సందర్శన...
సీపీఎం, సీపీఐ, సహా న్యూ డెమోక్రసీ, తెదేపా, జన సమితి పార్టీ నేతలు జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శించారు. ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణలో ఉన్న కొవిడ్ ఐసోలేషన్ వార్డులో కలియతిరిగారు. అనంతరం సిబ్బందితో మాట్లాడారు.