తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 7:36 PM IST

ETV Bharat / state

మధిర వ్యాక్సిన్ కేంద్రం ఎదుట ప్రజల ఆందోళన

ఖమ్మం జిల్లా మధిరలోని కరోనా వ్యాక్సిన్ కేంద్రం ఎదుట ప్రజలు ఆందోళన చేశారు. ప్రతిరోజు వచ్చి క్యూలో నిల్చుంటున్నా టీకాలు ఇవ్వడం లేదని వాపోయారు.

madhira people protest infront of corna vaccine center
మధిర వ్యాక్సిన్ కేంద్రం ఎదుట ప్రజల ఆందోళన

ఖమ్మం జిల్లా మధిరలోని సీపీఎస్ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రం ఎదుట ప్రజలు ఆందోళన చేశారు. ఉదయమే వచ్చి క్యూలో నిల్చున్నప్పటికీ... టీకాలు ఇవ్వడం లేదని నిరసన చేపట్టారు. నియోజకవర్గంలో రోజుకు 100 నుంచి 400 టీకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని... కానీ టీకాల కోసం వందలాది మంది పడిగాపులు కాస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శీలం నరసింహారావు పాల్గొన్నారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మాట్లాడి ప్రజల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. రేపటి నుంచి కేంద్రానికి వచ్చిన వారందరికీ వ్యాక్సిన్​లు అందిస్తామని వైద్యాధికారులు హామీ ఇవ్వడంతో... నిరసనకారులు శాంతించారు. ఆందోళనను విరమించి ఇళ్లకు వెళ్లిపోయారు.

ఇదీ చూడండి:Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details