తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రూపు రాజకీయాలకు తావులేదు.. గెలుపు గుర్రాలకే టికెట్లు..' - ktr

ktr in khammam
ఖమ్మం నేతలతో మంత్రి కేటీఆర్

By

Published : Jun 11, 2022, 4:06 PM IST

Updated : Jun 11, 2022, 5:05 PM IST

16:04 June 11

ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో కేటీఆర్ ప్రత్యేక భేటీ

ktr in khammam: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఖమ్మంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్​.. ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అసంతృప్త నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి జిల్లాలో తెరాస బలోపేతంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నేతల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెరాస ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు. ఖమ్మం మినహా ఇతర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్‌ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 11, 2022, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details