ఖమ్మం నగరంలో రోజురోజుకీ వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వాటి దాడిలో అనేక మంది గాయపడుతున్నారు. కొన్ని వీధుల్లో తిరగటానికి సైతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. దీంతో కుక్కల సమస్యను పరిష్కరించేందుకు నగర పాలక సంస్థ చర్యలకు పూనుకుంది. ఈమేరకు రోటరీనగర్లో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ కేంద్రంలో ప్రత్యేకంగా వీధి కుక్కల నియంత్రణకు ఆపరేషన్లు చేయాలని నిర్ణయించింది. అందుకు హైదరాబాద్కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వారు పదిమంది సుమారు 6నెలల పాటు ఈ కేంద్రంలో ఉండి కుక్కల నియంత్రణపై పని చేస్తారు.
నియంత్రణ ఆపరేషన్..