ఖమ్మం జిల్లాలో 432 ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా గ్రామాల్లో ఎగుమతులు, కాంటాలు పూర్తిస్థాయిలో లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వారీగా బస్తాలు దిగుమతి చేసుకున్నా.. కేంద్రాల నిర్వహణలో జాప్యం జరుగుతుందని కర్షకులు ఆరోపిస్తున్నారు. తేమశాతం పరిశీలించి కూపన్లు ఇస్తామని చెబుతున్నా చాలా గ్రామాల్లో అమలుకావడం లేదని ఆరోపిస్తున్నారు. తేమశాతంలో చాలా వరకు జాప్యం జరుగుతున్నాయని.. కాగా అకాల వర్షాల ధాటికి రోజూ కుప్పలను ఆరబోసుకోవడం కుప్పచేసుకోవడం జరుగుతుందని వాపోతున్నారు.
వైరా- మధిర రహదారిలో కిలోమీటర్ల మేర ధాన్యం ఆరబోసి దర్శనమిస్తున్నాయి. మొక్కొజొన్న రాశులతో ఇళ్ల ముందు కూపన్ల కోసం ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కాంటాలు ఎగుమతి చేయాలని కోరుతున్నారు. వైరా మండలం పూసలపాడు, గరికపాడు, వైరా సహకార సంఘాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం లారీలకు ఎగుమతి చేసినా రవాణా సరిగా లేదని, మిల్లుల వద్ద దిగుమతులు కావడం లేదని.. హమాలీలు లేరంటూ జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
"కూలీల, ట్రాక్టర్ల రేట్లు పెరిగాయి.. ప్రభుత్వ కాస్త సబ్సిడీ ఇచ్చి తమను ఆదుకోవాలి.