తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2019, 5:45 PM IST

ETV Bharat / state

లంచాలలో ఈ తీరే వేరయా... ఆ అధికారి ఇలా బుక్కయ్యాడు!

లంచం తీరు మారుతోంది! ఇప్పటివరకూ డబ్బులు తీసుకుంటుంటే... రెడ్​హ్యాండెడ్​గా "అనిశా" దాడి చేసి పట్టుకోవడం చూశాం. కానీ కారేపల్లిలో ఎవరూ ఊహించని రీతిలో లంచం తీసుకోవడం కలకలం రేపింది. అయినప్పటికీ అనిశాకు చిక్కడంతో ఆ అధికారి గుట్టు రట్టయింది. ఇంతకీ ఆ అధికారి లంచం ఎలా తీసుకుంటున్నాడంటే...

ఫోన్​ పే ద్వారా లంచం తీసుకున్న ఈవోపీఆర్డీ

ఖమ్మం జిల్లా కారెపల్లి ఎంపీడీవో కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈవోపీఆర్డీ విక్రమ్​ కుమార్...​ ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి హరిదాస్​ నాయక్​ వేతనం మంజూరు చేయడానికి లంచం డిమాండ్​ చేశాడు. దానికి అంగీకరించిన హరిదాస్​ ఫోన్​ పే యాప్​ ద్వారా 14 వేల రూపాయలు ట్రాన్స్​ఫర్​ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న అనిశా అధికారులు ఆధారాలతో సహా విక్రమ్​ కుమార్​ను పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ​

ABOUT THE AUTHOR

...view details