తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఖమ్మంలో నిరసన తెలిపారు. అనంతరం పెవిలియన్ మైదానం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉందని.. గ్రామాల్లో తమకు ఎవరూ సహకరించట్లేదని వాపోయారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
'మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి: పంచాయతీ కార్యదర్శులు' - సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్
ఖమ్మం జిల్లా కేంద్రంలో పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు ర్యాలీ చేపట్టారు. తక్షణమే తమ సమస్యలను తీర్చాలని డిమాండ్ చేశారు.
మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు