వరంగల్ రేంజ్ ఐజీ నాగిరెడ్డి ఖమ్మంలో పర్యటించారు. నగరంలో లాక్డౌన్ అమలును పరిశీలించారు. సీపీ విష్ణు వారియర్తో కలిసి నగరంలోని పోలీస్ చెక్ పాయింట్లను పరిశీలించారు. లాక్డౌన్ ప్రారంభమైన తర్వాత వీధుల్లో తిరిగి, సిబ్బందితో మాట్లాడారు.
ఖమ్మంలో ఐజీ పర్యటన.. లాక్డౌన్ అమలు తీరు పరిశీలన - lockdown in khammam
ఐజీ నాగిరెడ్డి ఖమ్మం నగరంలో పర్యటించారు. కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ విధించిన లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
![ఖమ్మంలో ఐజీ పర్యటన.. లాక్డౌన్ అమలు తీరు పరిశీలన lockdown in khammam, khammam lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11866880-716-11866880-1621760026253.jpg)
లాక్డౌన్, ఖమ్మంలో లాక్డౌన్
కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్కు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సడలింపు సమయంలో ప్రజలు నిత్యావసరాలు కొనేందుకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించాలని కోరారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని అనవసరంగా రోడ్డుపైకి వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చదవండి :భారత్లో 2% కాదు.. 24% మందికి కరోనా!