తెలంగాణ

telangana

ఖమ్మం మార్కెట్​కు పోటెత్తిన మిర్చి.. ఈరోజు ధర ఎంతంటే.!

By

Published : Feb 14, 2022, 7:34 PM IST

Mirchi rush at Khammam Market yard: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి.​ ఖమ్మం మార్కెట్​కు నేడు భారీగా మిర్చి తరలివచ్చింది. ఈ ఒక్కరోజే సుమారుగా 80 వేల బస్తాలు మార్కెట్​కు తరలిరాగా.. ఈ సీజన్​లో ఇదే అత్యధిక సంఖ్యగా నమోదైంది.

huge crowd of mirchi farmers to khammam market yard
ఖమ్మం మార్కెట్​ యార్డులో మిర్చి కొనుగోళ్లు

Mirchi rush at Khammam Market yard: ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా తరలివచ్చింది. రెండు రోజుల తర్వాత మార్కెట్‌ తెరవటంతో అధిక సంఖ్యలో మిర్చిని రైతులు తీసుకొచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు మిరపను తరలించారు.

ఖమ్మం మార్కెట్​ యార్డుకు భారీగా తరలివచ్చిన మిర్చి

మొదటి గంటలో మందకొడిగా ప్రారంభమైన కొనుగోళ్లు ఆ తర్వాత జోరందుకున్నాయి. జెండా పాట క్వింటాకు రూ. 19 వేలు నిర్ధరించిన వ్యాపారులు... కనిష్ఠంగా రూ. 17 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఒక్క రోజే సుమారు 80 వేల బస్తాలు మార్కెట్‌కు తరలివచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

మిర్చి కొనుగోళ్లు

ఓ వైపు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి తగ్గినా.. మద్దతు ధరలు పెరగడం రైతులకు ఊరట కలిగిస్తోంది. మిర్చి నాణ్యతను బట్టి వ్యాపారులు ధరను నిర్ణయిస్తున్నారు.

మిర్చి కొనుగోళ్లతో కిటకిటలాడుతున్న ఖమ్మం మార్కెట్​ యార్డు

ఇవీ చదవండి:App for Mirchi Drip Irrigation: 'మిర్చి మిత్ర'తో.. సాగులో లాభాల యాత్ర

Mirchi farmer : మిర్చి రైతుకు కంప్యూటర్‌ మిత్రుడు..

ABOUT THE AUTHOR

...view details