తెలంగాణ

telangana

కరోనా నుంచి విముక్తి కోసం హోమం

By

Published : Dec 5, 2020, 1:18 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని హరిహర క్షేత్రంలో నిర్వహించిన గణపతి హోమంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పాల్గొన్నారు. కరోనా నుంచి ప్రజలకు విముక్తి, సుఖశాంతులతో ఉండాలని హోమం చేపట్టారు.

Home for liberation from the corona at yellandu
కరోనా నుంచి విముక్తి కోసం హోమం నిర్వహణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని శ్రీహరిహర క్షేత్రంలో కరోనా నుంచి ప్రజలకు విముక్తి, సుఖశాంతులతో ఉండాలని గణపతి హోమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్​ గూగులోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

పూజకు విచ్చేసిన కమిషనర్​ను దేవాదాయ శాఖ తరపున అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మస్తాన్ రావు, ఆలయ ఛైర్మన్ కొప్పురావురి భాస్కర్, దేవాదాయ రెవెన్యూ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details