ఖమ్మం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత ఐదు రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 45, 46 డిగ్రీలకు తగ్గకుండా భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడంలేదు. మధ్యాహ్న సమయాల్లో వందలాది వాహనాలతో రద్దీగా ఉండే వైరా రోడ్డు నిర్మానుష్యంగా మారిపోయింది.
ఖమ్మంలో ఠారెత్తిస్తున్న ఎండలు
ఖమ్మం జిల్లాలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. 45, 46 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.
ఠారెత్తిస్తున్న ఎండలు