ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు కూడలిలో ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం కురిసింది. వైరా వైపు వెళ్లే జాతీయ రహదారిపై పెద్ద వృక్షం కూలిపోయింది. రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.సుమారు రెండు వైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి.
వర్షంతో నేలకొరిగిన వృక్షం... ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం..
ఖమ్మంలో కురిసిన భారీ వర్షానికి ఓ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు జేసీబీతో చెట్టును తొలిగించారు.
వర్షంతో నేలకొరిగిన వృక్షం... కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
వర్షం కురిసిన కారణంగా వాహన చోదకులు మరింత ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్టును తొలిగించారు.