తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతు శ్రేయస్సుకే కేసీఆర్​ మొదటి ప్రాధాన్యం' - ధాన్యం కొనుగోలు కేంద్రాలు

దేశంలోనే రైతుల నుంచే ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని ఎమ్మెల్యే సండ్ర వెంటక వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

grain purchasing centers are started by the mla sandra venkata veeraih in khammam
'రైతు శ్రేయస్సుకే కేసీఆర్​ మొదటి ప్రాధాన్యం'

By

Published : Apr 8, 2020, 4:38 PM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కొర్లగూడెం, పేరువంచ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీసీబీ ఛైర్మన్ భూషయ్య, మార్క్​ఫెడ్ ఉపాధ్యక్షుడు బుర్ర రాజశేఖర్​లతో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. దేశంలోనే రైతుల నుంచే నేరుగా ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని ఎమ్మెల్యే అన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో రబీ సీజన్లో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుకు రూ. 30 వేల కోట్లు కేటాయించిన రైతుబంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రైతు శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్​ లాంటి ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్ర ప్రజల అదృష్టమని ఆయన తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు భౌతిక దూరం, స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రజలందరూ తప్పక పాటించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ఇకపై మూడు విభాగాలుగా కరోనా ఆసుపత్రులు

ABOUT THE AUTHOR

...view details