తెలంగాణ

telangana

ETV Bharat / state

హరితహారం మొక్కలు తిన్న మేకలు.. యజమానులకు జరిమానా - ఖమ్మంలో v

ఖమ్మం జిల్లా కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు తిన్న ఏడు మేకలను పురపాలక సిబ్బంది బంధించింది. సోమవారంలోపు మేకకు మూడు వేల చొప్పున జరిమానా చెల్లించి తీసుకు వెళ్లాలని కమిషనర్ ప్రకటించారు.

goats eaten harithaharam trees in khammam
హరితహారం మొక్కలు తిన్న మేకలు.. యజమానులకు జరిమానా

By

Published : Jul 26, 2020, 3:36 PM IST

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి వెంట నాటిన మొక్కలను మేకలను తినేస్తున్నాయి. విషయం గుర్తించిన పురపాలక సిబ్బంది మొక్కలను తింటున్న ఏడు మేకలను బంధించారు. సోమవారంలోపు మేకల జమానులు వచ్చి మేకకు 3 వేల రూపాయల చొప్పున జరిమానా చెల్లించి వాటిని తీసుసుకెళ్లాలని లేనిపక్షంలో... మేకలను వేలం వేస్తామంటూ కనిషనర్ ప్రకటన విడుదల చేశారు.

పురపాలక సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న మేకల యజమానులు ఇప్పటికీ మేకల కోసం రావడం లేదు. రేపటి లోపు రాకపోతే వాటిని వేలం వేస్తామని... ఆ తర్వాత తమకేం సంబంధం లేదని కమిషనర్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details