ఖమ్మం నగరంలో చెత్తను సేకరించేందుకు నూతనంగా 30 ట్రాలీ ఆటోలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. పెవిలియన్ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ సహ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఇప్పటివరకే 20 ఆటోలు ఉన్నాయని.. మరో 30 ఆటోలతో ప్రత్యేకంగా కేటాయించిన డివిజన్లలోని చెత్తను సేకరిస్తామని పురపాలక అధికారులు తెలిపారు.
'పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం' - Khammam district news
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే.. ఆరోగ్యం మన సొంతమవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఇంట్లోని చెత్తను పారవేయాలని సూచించారు. ఖమ్మంలో చెత్తను సేకరించే 30 ఆటోలను ప్రారంభించారు.
!['పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం' auto](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8946864-322-8946864-1601127279937.jpg)
auto
ప్రజలంతా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేసి పారిశుద్ధ్య కార్మికులు, పురపాలక సిబ్బంది పనిని సులభం చేయాలని మంత్రి కోరారు. ఇంట్లోని చెత్తను ఎప్పటికప్పుడు పారవేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Last Updated : Sep 26, 2020, 7:05 PM IST