తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ ఇంజినీరింగ్​ విద్యార్థుల అరెస్టుకు పెద్ద కారణమే ఉంది..

ఇంజినీరింగ్ చదివి బాగుపడతావనుకున్నారు వారి తల్లిదండ్రులు. కానీ ఆ విద్యార్థులు మాత్రం జల్సాల రుచి మరిగి.. పక్కదారి పట్టారు. ఫలితంగా ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటంటే...!

By

Published : Aug 17, 2019, 11:46 PM IST

Updated : Aug 18, 2019, 12:48 PM IST

గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ఇంజినీరింగ్​ విద్యార్థులు అరెస్ట్​

హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 8 కిలోల గంజాయి, 8 చరవాణీలు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్​ సీఐ రామకృష్ణ వెల్లడించారు. శంషాబాద్​ బస్టాండ్​ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన తుమ్మ భానుతేజరెడ్డి, దుబ్బాక సాయి నరేష్‌, కర్నాటి అఖిల్, షేక్ నయీం, కొండ సాయికుమార్ గంజాయికి బానిసలుగా మారారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్​ రాజేంద్రనగర్​ పరిధిలోని శ్రీమల్లె కాలనీలో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. సీలేరు, అరకు వంటి ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలోని ఇంజినీరింగ్​ విద్యార్థులు, సాఫ్టేవేర్​ ఇంజినీర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఇంజినీరింగ్​ విద్యార్థుల అరెస్టుకు పెద్ద కారణమే ఉంది..

ఇవీ చూడండి: వరద ముంచెత్తింది... ఊరు రోడ్డున పడింది!

Last Updated : Aug 18, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details