రేడియేటర్ వేడెక్కి కారు దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెంలో చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి బంధువులతో కలిసి వేంసూరు మండలం కల్లూరుగూడేనికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రాయుడుపాలెం దగ్గరకు రాగానే రేడియేటర్ నుంచి పొగలు రాగానే కారు పక్కకు ఆపి దిగారు. చూస్తుండగానే ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలు కాస్తా పెట్రోల్ ట్యాంకుకు అంటుకొని కారు పూర్తిగా దగ్ధమైంది.
రేడియేటర్లో చెలరేగిన మంటలు.. కారు దగ్ధం - కారు దగ్ధం
ఖమ్మం జిల్లా రాయుడుపాలెం వద్ద కారు దగ్ధమైంది. రేడియేటర్ వేడెక్కి ఇంజిన్లో పొగలు వచ్చాయి. పొగలు మంటలుగా మారి పెట్రోల్ ట్యాంకు అంటుకొని కారు పూర్తిగా తగలబడింది.

రేడియేటర్లో చెలరేగిన మంటలు కారు దగ్ధం