ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. డాక్టర్ రమేశ్ ఆధ్వర్యంలో ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపను బయటకు తీశారు.
ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం - 5 kgs baby girl born in khammam hospital
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ప్రభుత్వ వైద్యశాలలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ఆడ శిశువు 5 కిలోల బరువుతో జన్మించింది.
![ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం five kilo grams baby birl born in khammam hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7136312-961-7136312-1589094996627.jpg)
ఖమ్మం ఆసుపత్రిలో 5 కిలోల బరువుతో శిశువు జననం
5కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.