ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం, బిల్లుపాడు, వెంకటగిరి ప్రాంతాల్లో రబీ సాగుకు సాగర్ జలాలు రావడం లేదని రైతులు ఆరోపించారు. 10 రోజులుగా నీళ్లులేక చేతికొచ్చిన వరి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పొట్ట పోసుకున్న వరిసాగు నీరు రాక ఎండిపోతోందని తల్లాడ ఎన్నెస్పీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఎండిన కంకులను తహసీల్దార్ శ్రీలతకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు.