తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతలకు పరిహారం అందించాలి: రైతు సంఘాలు - ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘాల ధర్నా

ఖమ్మం జిల్లా ఏన్కూరు వ్యవసాయ మార్కెట్​ను రైతు సంఘం నాయకులు సందర్శించారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

farmer-associations-protest-at-yenkuru-in-khammam-district
అన్నదాతలకు పరిహారం అందించాలి: రైతు సంఘాలు

By

Published : Oct 20, 2020, 3:30 PM IST

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతు సంఘాలు ఆందోళ చేపట్టాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్​ చేశారు.

పత్తి ధర క్వింటా రూ. 3000కి కొనుగోలు చేస్తుండటంతో ఆ విషయాన్ని అన్ని మార్కెట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీసీఐ కేంద్రం ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

ఇదీ చూడండి:జీతం కోసం కాదు.. జీవితం కోసం పోరాడాం: రాజేందర్

ABOUT THE AUTHOR

...view details