తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెంలో ఇందిరా క్రాంతిపథం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు.

By

Published : Nov 20, 2019, 10:56 PM IST

ధాన్యం కొనగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో 61 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. గతేడాది లారీలు, బస్తాలు, హమాలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారని కానీ, ఇకపై ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర ప్రకారంమే కొనుగోలు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ ఛైర్మన్​ మువ్వా విజయ్ బాబు, పీఆర్డీవో ఇందుమతి, ఎంపీపీ లక్కినేని అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details