తెలంగాణ

telangana

ETV Bharat / state

వలకూలీలకు అండగా.. దాతల ఆపన్నహస్తం

లాక్​డౌన్​ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వైరాలోని వలసకూలీలకు కొందరు దాతలు అండగా నిలుస్తున్నారు. అన్నదానం చేయడం.. నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు.

By

Published : Apr 4, 2020, 12:39 PM IST

Donors distributing essentials to migrants in Khammam district Vaira
వలకూలీలకు అండగా.. దాతల ఆపన్నహస్తం

కరోనా నేపథ్యంలో తమ ప్రాంతాలకు వెళ్లలేక పొలాల్లో చిక్కుకున్న వలస కూలీలకు ఆసరాగా దాతలు తామున్నామంటూ చేయూతనిస్తున్నారు. గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు, ఏన్కూరు మండలాల్లోని వలసకూలీలను ఆదుకుంటూ దాతలు సేవాభావాన్ని చాటుకున్నారు. జూలూరుపాడులో కిరాణా మర్చంట్‌ వ్యాపారులు, పోలీసుల ఆధ్వర్యంలో 300 మంది కూలీలకు సరుకులు, పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. ఏన్కూరులో గణేశ్​‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 50 మందికి అన్నదానం చేశారు.

వలకూలీలకు అండగా.. దాతల ఆపన్నహస్తం

ABOUT THE AUTHOR

...view details