సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు రూ. 3లక్షల విలువ చేసే.. బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్లు, కుట్టుమిషన్లు అందజేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని లింబ్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వికలాంగులకు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ - ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ వార్తలు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు ఖమ్మంలోని సామినేని వ్యాజ్జయ్య మెమోరియల్ సంస్థ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
![దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ khammam, handicapped, try cycles and stitching machines](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10187124-666-10187124-1610259814915.jpg)
ఖమ్మం, దివ్వాంగులు, ట్రై సైకిళ్లు, కుట్టుమిషన్ల పంపిణీ
ట్రై సైకిళ్లను అందజేసిన దాతలను మంత్రి అభినందించారు. ప్రతి ఏడాది తమ సంస్థ ద్వారా పేదలకు సహాయం చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
ఇదీ చదవండి:తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన: తరుణ్ చుగ్