తెలంగాణ

telangana

By

Published : Oct 26, 2020, 4:46 AM IST

ETV Bharat / state

కరోనా వల్ల కళ తప్పిన దసరా ఉత్సవాలు

కరోనా వల్ల ఖమ్మం జిల్లాలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ ఏడాది దసరా వేడుకలు కళతప్పాయి. పండుగ ఉత్సవాలు చాలా చోట్ల రద్దయ్యాయి. చరిత్రలో మొదటిసారిగా స్వామివారి పార్వేటను గుట్టపై నిర్వహించారు.

dasara festival effected due to corona virus in khammam
కరోనాతో కళ తప్పిన దసరా ఉత్సవాలు

కరోనా మహమ్మారి వల్ల ఖమ్మం జిల్లాలో స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు బోసిపోయాయి. చరిత్రలో మొదటిసారిగా స్వామివారి పార్వేటను జమ్మి బండపై రద్దుచేసి గుట్టపైన నిర్వహించారు.

ఏటా దసరా రోజున జమ్మిబండపై స్వామివారు పార్వేటకు విచ్చేసేవారు. వేలాది మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకునేవారు. మొదటిసారిగా గుట్టపై ఆలయ ప్రాంగణంలో శమీ పూజ నిర్వహించారు. ఈ వేడుకకు కొద్ది మంది భక్తులు మాత్రమే హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి:నిర్మల్​లో ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మంత్రి

ABOUT THE AUTHOR

...view details