- ఖమ్మం జిల్లా వైరా మండలం కొష్టాలలో 100 పేదలకు జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, తెరాస నాయకుడు కార్తీక్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంచి పెట్టారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, టీఎస్ మార్క్ఫెడ్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని సరుకులను పంపిణీ చేశారు.
- వైరా మునిసిపాలిటీలోని ఒకటో వార్డు ఎస్సీకాలనీలో వార్డు డైరెక్టర్ మరికంటి డేడికుమారి, నాయకులు మద్దెల రవి ఆధ్వర్యంలో 400 మంది పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని సరుకులు అందించారు.
- వైరా పురపాలికలో పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
- ఏన్కూరు మండలం సాయిరాంతండాలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధిహామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు మాస్క్లు పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాల పంపిణీ - ఖమ్మం వైరా లాక్డౌన్
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు ఆపన్నహస్తం అందించారు. జిల్లాలోని వైరా, ఏన్కూరు మండలాల్లో పేదలకు నిత్యావసరాలు, మాస్కులను పంచిపెట్టారు. పారిశుద్ధ్య కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు.
![పేదలకు నిత్యావసరాల పంపిణీ పేదలకు నిత్యావసరాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6902259-173-6902259-1587583759233.jpg)
పేదలకు నిత్యావసరాల పంపిణీ