తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా - ఖమ్మంలో సీపీఎం నాయకుల నిరసన

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో దేశంలోని అన్నదాతల నడ్డి విరుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆరోపించారు. ఆ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు.

కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా
కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా

By

Published : Sep 23, 2020, 6:01 PM IST

రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్‌ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో దేశంలోని అన్నదాతల నడ్డి విరుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు ఆరోపించారు. ఆ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలా లేని పక్షంలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:'వ్యవసాయ బిల్లుతో దేశానికి పొంచిఉన్న ప్రమాదం'

ABOUT THE AUTHOR

...view details