రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మంలో సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా - ఖమ్మంలో సీపీఎం నాయకుల నిరసన
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో దేశంలోని అన్నదాతల నడ్డి విరుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ఆరోపించారు. ఆ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు.
![కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8906460-87-8906460-1600863880193.jpg)
కేంద్రం వ్యవసాయ బిల్లులు ఉపసంహరించుకోవాలని ధర్నా
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ బిల్లుతో దేశంలోని అన్నదాతల నడ్డి విరుస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ఆరోపించారు. ఆ బిల్లులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా లేని పక్షంలో రైతులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తారని హెచ్చరించారు.