ఖమ్మం జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాధారణ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ముందస్తుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు - updated news on Cooperative elections
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సహకార ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు
మండల కేంద్రాల్లో ఒకటే పోలింగ్ కేంద్రం ఉండడం వల్ల గ్రామాల నుంచి ఓటర్లు అక్కడికి తరలి వెళ్తున్నారు. వైరా, ఏన్కూరు, తల్లాడ, కారేపల్లి మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా సాగుతున్న సహకార ఎన్నికలు
ఇదీ చూడండి:మరింత స్వేచ్ఛ ఇచ్చినప్పుడే కేంద్ర లక్ష్యం నెరవేరుతుంది : కేటీఆర్