ప్రధాని మోదీ అసంబద్ధ నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు ఆరోపించారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంలో భారీ నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనతో కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడం వల్ల గేటు బయటే భైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఆర్టీసీ కేసులో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి చెంప పెట్టన్న వీహెచ్.. న్యాయస్థానానికి సలాం చేస్తున్నానన్నారు. మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు సలాం: వీహెచ్ - congress rally at khammam
మోదీ పాలనకు వ్యతిరేకంగా ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. కలెక్టరేట్ ఎదుట భైఠాయించిన ఆపార్టీ సీనియర్ నేత వీహెచ్.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ విషయంలో హైకోర్టుకు సలాం: వీహెచ్