తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?: కాంగ్రెస్​ నాయకులు - congress leaders visit 2 bedroom houses at khammam district

ఖమ్మం జిల్లాలో 2 పడక గదుల ఇళ్లను డీసీసీ నాయకులు పరిశీలించారు. నిర్మాణాల నాణ్యతా లోపాలు బయటపెట్టిన యువకుల మీద కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు.

congress leaders visit 2 bedroom houses at khammam  district
ప్రశ్నిస్తే.. కేసులు పెడతారా?: కాంగ్రెస్​ నాయకులు

By

Published : Sep 1, 2020, 11:41 AM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో 2 పడక గదుల ఇళ్లు నాసిరకంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో, నాసిరకం పనులను బయటపెట్టిన యువకులపై కేసు నమోదు చేశారు. దీనితో డీసీసీ నాయకులు దుర్గాప్రసాద్​ జేడ్పీటీసీ ప్రవీణ్​కుమార్​ ఆధ్వర్యంలో కాంగ్రెస్​ బృందం పర్యటించి.. ఇళ్లను పరిశీలించారు.

నిర్మాణాల నాణ్యతా లోపాలు బయటపెట్టిన యువకుల మీద కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు. అధికారులు స్పందించి.. నాణ్యత ప్రమాణాలు పాటించని గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని అవినీతికి పాల్పడిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. వీటి నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరారు.

ఇదీ చదవండి:స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details