తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy On Telangana Elections 2023 : 'డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి.. విజయోత్సవ సభా ఇక్కడే' - ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ

Congress Janagarjana Meeting in Khammam : పొంగులేటి చేరికతో వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబరు 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. మరోపైపు తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేసిన బీఆర్​ఎస్​.. జనం సమస్యలను మాత్రం తీర్చలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో వీరిరువురు ప్రసంగించారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Jul 2, 2023, 8:21 PM IST

Updated : Jul 2, 2023, 8:41 PM IST

Revanth Reddy Speech at Khammam Meeting : డిసెంబరు 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. ఆరోజే విజయోత్సవ సభ ఇక్కడే జరుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసింది.. ఖమ్మం జిల్లానేనని గుర్తు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. కాంగ్రెస్ సభకు భారీగా ప్రజానీకం వచ్చారని హర్షించారు. అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు పాదాలపై నడిపిస్తామని రేవంత్ అన్నారు. పొంగులేటి చేరికతో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ప్రసంగించారు.

డిసెంబర్ 9 నాటికి అధికారంలోకి.. విజయోత్సవ సభా ఇక్కడే

"తెలంగాణ పొలిమేరల నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని .. అండమాన్ వరకు తరమాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే. కేసీఆర్ నుంచి విముక్తి కల్పించడానికి లక్షలాది ఖమ్మం బిడ్డలు ఈ రోజు సమావేశానికి వచ్చారు. సభ పెట్టుకుంటామంటే బస్సులు, లారీలను రానివ్వలేదు. రాబోయే డిసెంబరు 9 నాడు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది." - రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షడు

Batti Vikramarka Comments On BRS : మరోవైపు బీఆర్​ఎస్​ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారు.. కానీ జనం సమస్యలను తీర్చలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకు కాంగ్రెస్ రావాలని భట్టి స్పష్టం చేశారు. ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో భట్టి విక్రమార్క పాల్గొని.. ప్రసంగించారు. ఈ మేరకు బీఆర్​ఎస్​, కేసీఆర్​లపై విమర్శలు గుప్పించారు.

నిధులు, నీళ్లు, నియామకాల కోసం మాత్రమే సాధించుకున్న తెలంగాణలో.. నేడు ఉద్యోగాలు రాక యువత ఇబ్బంది పడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతరానికి భంగపాటు తప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్న సర్కారు బీఆర్​ఎస్ అని ధ్వజమెత్తారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాము ఇచ్చిన భూములు పరాధీనం కానివ్వబోమని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Batti Vikramarka PeoplesMarch : తాను పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నప్పుడు.. పేదల నుంచి ఎక్కువగా ఇళ్లు, స్థలాలు ఇప్పించాలనే డిమాండ్లు వచ్చాయని భట్టి విక్రమార్క సభా వేదికగా తెలిపారు. బీఆర్​ఎస్ నాయకులు చెప్పే ఈ బంగారు తెలంగాణలో జాతీయ క్రీడాకారిణి కూడా సోడా అమ్ముకుని బతుకుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని.. భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ సర్కారును బంగాళాఖాతంలో కలపాల్సిందేనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచి చూపిస్తుందని భట్టి విక్రమార్క సవాల్ విసిరారు.

ఇవీ చదవండి :

Last Updated : Jul 2, 2023, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details