తెలంగాణ

telangana

ETV Bharat / state

Rahul Gandhi Khammam Meeting Speech : 'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం' - ఖమ్మంలో జనగర్జన సభ

Rahul Gandhi Fires on KCR : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ బీఆర్​ఎస్​ తీరుపై మండిపడ్డారు. ఆ పార్టీతో కలిసి పయనించేది లేదని స్పష్టం చేశారు. భారత్ రాష్ట్ర సమితి.. బీజేపీకి బీటీమ్ అని ఆరోపించారు. పార్లమెంట్​లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తాము కొట్లాడుతుంటే.. బీఆర్ఎస్.. బీజేపీకి మద్ధతుగా నిలిచిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఎత్తున అవినీతి పాల్పడుతున్నారని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని రూ.లక్ష కోట్లు అవినీతి జరిగిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వృద్ధులకు రూ.4,000 పింఛన్ ఇస్తామని ప్రకటించిన రాహుల్​గాంధీ.. తెలంగాణలో కర్ణాటక ఫలితాలు పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

Khammam Congress Jana Garjana Meeting
Khammam Congress Jana Garjana Meeting

By

Published : Jul 3, 2023, 7:37 AM IST

'కర్ణాటక తరహాలో.. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతాం'

Rahul Gandhi Comments on BRS :భారత్ రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీకి.. బీ టీమ్‌గా మారిపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఖమ్మంలో జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్‌.. సీఎం కేసీఆర్​పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ అవినీతికి.. ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయని దుయ్యబట్టారు. లిక్కర్‌ స్కామ్ ఎవరు చేశారో.. మోదీ ఏజెన్సీలకు తెలిసినా ఏం చేయడం లేదంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామన్న ఆయన.. చేయూత పేరిట వృద్ధులు, వితంతువులకు పింఛన్‌ రూ.4,000 చేస్తామన్నారు. పోడు భూములన్నింటినీ పంచుతామని ప్రకటించారు.

Rahul Gandhi Khammam Meeting Speech :ఖమ్మంలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనగర్జన సభ.. శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరై..మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీనివాస్​రెడ్డి అనుచరులు కూడా రాహుల్‌ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. భారత్‌ జోడోయాత్రకు కొనసాగింపుగాసీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను సభా వేదికపై రాహుల్‌ సమక్షంలో ముగించారు. విక్రమార్కను ప్రత్యేకంగా అభినందించిన రాహుల్‌.. ఆయన్ను సన్మానించారు.

Congress Meeting at Khammam :అనంతరం శ్రేణులనుద్దేశించి మాట్లాడిన రాహుల్‌.. బీఆర్ఎస్​ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలు తలచింది ఒకటైతే.. బీఆర్ఎస్ చేసేది ఒకటంటూ ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఏకంగా తన పార్టీ పేరే మార్చుకొని భారత్​ రాష్ట్ర సమితిగా మారిందన్నారు. బీఆర్ఎస్​ అంటే బీజేపీ రిస్తేదార్‌ సమితి అని.. రాహుల్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖతం అయ్యిందని.. వాళ్లకే తెలియకుండా చిరునామా లేకుండా పోయిందని ఆరోపించారు. హైవేపై నడుస్తున్న బండికి.. నాలుగు చక్రాలు పంక్చర్‌ అయినట్టుందన్న ఆయన.. ఇప్పుడు పోటీ కాంగ్రెస్‌, బీజేపీ బీ టీమ్‌ మధ్యే ఉంటుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Congress Jana Garjana Sabha In Khammam : ఖమ్మం వేదికగా రాహుల్‌ గాంధీ.. కర్ణాటక తరహాలో మరో ఎన్నికల హామీ ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. చేయూత పేరుతో పింఛన్‌ను రూ.4,000 చేస్తామని వివరించారు. ఖమ్మంలో తెలంగాణ జనగర్జన సభ బీఆర్ఎస్ పతనానికి నాంది పలకబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 9 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేసిన రేవంత్.. డిసెంబర్ 9న విజయోత్సవ సభ ఖమ్మంలోనే ఉంటుందని చెప్పారు.

పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నానని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సంపదను ప్రజలకు పంచేందుకు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలని భట్టి ఆకాంక్షించారు. రైతు రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పక్కా ఇళ్లు లాంటి హామీలను బీఆర్ఎస్ సర్కారు విస్మరించిందని.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్​ను బంగాళాఖాతంలో కలపాలంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యమని పొంగులేటి తేల్చిచెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details