ఖమ్మం నగరపాలక సంస్థ ఉద్యోగులు మరోసారి ఘర్షణ పడ్డారు. సంస్థ కార్యాలయంలో శాశ్వత ఉద్యోగిగా పనిచేస్తున్న సుధాకర్కు పొరుగు సేవల ఉద్యోగుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. వివాదాలు పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకుని.. చివరికి పీఎస్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. - కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ
ఖమ్మం నగరపాలక సంస్థ ఉద్యోగుల మధ్య ఘర్షణ మరోసారి రోడ్డెక్కింది. నగర పాలకసంస్థ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఇద్దరు ఉద్యోగులు బాహాబాహీకు దిగి ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు. చివరికి పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

కేఎంసీ ఉద్యోగుల మధ్య గొడవ.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను పురుగుల కన్నా హీనంగా చూస్తూ వేధిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య మాటామాటా పెరిగి బుధవారం గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మొత్తానికి ఉద్యోగుల మధ్య లొల్లి... కేఎంసీ అధికారులకు తలనొప్పిగా మారింది.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!