పురపాలక అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖమ్మం జిల్లా పాలనాధికారి ఆర్వీ కర్ణన్ సూచించారు. వైరా పురపాలక కార్యాలయంలో నిర్వహించిన 2021-22 బడ్జెట్ ముఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన వైరా పురపాలికను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. పాలకమండలి సభ్యులు, అధికారులు సమష్టిగా ముందుకు సాగాలన్నారు. ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవాలని, పన్నుల వసూలులో కీలకంగా ఉండాలన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు.