మొదట ఖమ్మం పార్లమెంట్కు ఇంఛార్జిగా భట్టిని నియమించిన కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా పేరు మీద మరో ప్రకటన విడుదల చేసింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైరపర్సన్ విజయశాంతితో పాటు ప్రతిపక్షనేత భట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారని పేర్కొంది.
భట్టి ప్రచారానికి అధిష్ఠానం లైన్ క్లియర్
ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క ఒక్క ఖమ్మం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. సీఎల్పీ నేతతో పాటు విజయశాంతి అన్నిచోట్ల పర్యటించేందుకు అవకాశం కల్పించింది.
భట్టి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు
ఇవీ చూడండి:తెదేపాపై ఎందుకంత అక్కసు: రావుల