ఖమ్మం జిల్లాలో బక్రీద్ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున మసీదులకు వెళ్లి నమాజ్ చేశారు. తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు ప్రత్యేక వస్త్రధారణతో వచ్చి అందరినీ ఆకట్టకున్నారు. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, మేయర్ పాపాలాల్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రధాన మండలాల్లో ఉన్న మసీదుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
త్యాగానికి ప్రతీకైన బక్రీద్కు ప్రత్యేక ప్రార్థనలు - bakrid
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మంలో ముస్లింలు సామూహికంగా మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్, మేయర్ పాపాలాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![త్యాగానికి ప్రతీకైన బక్రీద్కు ప్రత్యేక ప్రార్థనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4112746-thumbnail-3x2-vysh.jpg)
త్యాగానికి ప్రతీకైన బక్రీద్కు ప్రత్యేక ప్రార్థనలు
త్యాగానికి ప్రతీకైన బక్రీద్ వేళ ప్రత్యేక ప్రార్థనలు