వానాకాలంలో మొక్కజొన్న సాగు వద్దని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రైతులకు సూచించారు. నియంత్రిత పంటల సాగు విధానంపై.. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వానాకాలంలో మొక్కజొన్న సాగు చేస్తే దిగుబడి తక్కువగా వస్తుందని, కత్తెర పురుగు ఎక్కువ విస్తరిస్తుందని కలెక్టర్ అన్నారు. రైతులు పంట మార్పిడి విధానం పాటించాలని.. పత్తిలో అంతర పంటగా కందిని సాగు చేయాలని సూచించారు. రైతుల అభివృద్ధి కోసమే నియంత్రిత సాగు విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని కర్ణన్ అన్నారు.
ప్రభుత్వం సూచించిన పంటలు సాగు చేస్తే లబ్ధి