'రాజీవ్ సేవలు మరువలేనివి'
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళి
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి రాందాస్ నాయక్ ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం పట్టణంలోని పేదలకు పండ్లలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.