తెలంగాణ

telangana

By

Published : Dec 27, 2019, 11:00 PM IST

ETV Bharat / state

బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో 3 క్వింటాళ్ల గంజాయి

ఖమ్మంలో మూడు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బిస్కెట్లు, చాక్లెట్ల డబ్బాలు తరలిస్తున్న ఓ కంటైనర్​లో గంజాయి దొరికింది. డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు..

3 QUINTAL GANZA SEIZED BY POLICE AT KHAMMAM
3 QUINTAL GANZA SEIZED BY POLICE AT KHAMMAM

బిస్కెట్లు, చాక్లెట్ ప్యాకెట్ల డబ్బాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్న భారీ మొత్తంలో గంజాయిని ఖమ్మం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. భద్రాచలం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్ వైపు కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.36 లక్షల విలువ చేసే 3 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం పోలీస్​స్టేషన్ ఎదురుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. కంటైనర్​ను ఆపే ప్రయత్నం చేయగా... పోలీసులను చూసి డ్రైవర్​ పారిపోయాడు. కంటైనర్​ను తెరిచి చూడగా... భారీగా గంజాయి కట్టలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బిస్కెట్లు, చాక్లెట్ల మధ్యలో 3 క్వింటాళ్ల గంజాయి

ABOUT THE AUTHOR

...view details