తెలంగాణ

telangana

By

Published : Jul 16, 2020, 10:50 PM IST

ETV Bharat / state

'బింగో' అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

మాయమాటలు చెప్పి ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ పట్టణంలో చోటు చేసుకుంది.

young man Raped 7 Years Old girl in Karim nagar district Huzurabad
ఏడెళ్ల బాలికపై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

ఏడేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి.. అత్యాచారం చేసిన నిందితుడిని కరీంనగర్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుజూరాబాద్​లో నివాసముంటున్న ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలికపై అదే కాలనీకి చెందిన కారుపాకల రాజు అనే యువకుడు జూన్​ 10న మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ అమ్మాయికి బింగో ప్యాకెట్​ కొనిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం తెలిసిన బాధితురాలి తల్లి పట్టణ సీఐ మాధవిని ఆశ్రయించి విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ మాధవి తెలిపారు. రాజును అదుపులోకి తీసుకొని రిమాండ్​కు తరలించినట్టు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చూడండి:మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details