తెలంగాణ

telangana

ETV Bharat / state

కనీస వేతనం కోసం కలెక్టరేట్ ఎక్కిన కార్మికులు - Telangana news

కనీస వేతనం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు కరీంనగర్ కలెక్టరేట్​లోని టవర్ ఎక్కి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కనీస వేతనం కోసం కలెక్టరేట్ ఎక్కిన కార్మికులు
కనీస వేతనం కోసం కలెక్టరేట్ ఎక్కిన కార్మికులు

By

Published : Mar 23, 2021, 6:35 PM IST

కరీంనగర్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు కనీస వేతన బకాయిల కోసం ఆందోళనకు దిగారు. కలెక్టరేట్​లో ఉన్న టవర్ ఎక్కిన కార్మికులు... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం కింద కేవలం రూ.1,000 వేతనంతో పని చేస్తున్నామని వాపోయారు.

రాష్ట్ర వ్యాప్తంగా 53 వేల మంది కార్మికులు ఉన్నామని... కనీస వేతనం గురించి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆనంద్, వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ నచ్చజెప్పే యత్నం చేశారు. కలెక్టర్ రావాల్సిందేనని డిమాండ్ చేస్తూ భవనంపైనే కార్మికులు బైఠాయించారు.

దాదాపు మూడు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ ఆనంద్ సూచనల మేరకు ఆందోళనను విరమింపజేశారు. అనంతరం తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా కలెక్టర్​కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఇదీ చూడండి:విద్యార్థులపై కరోనా పంజా.. రాష్ట్రంలో సెకండ్ వేవ్ ప్రారంభమైందా?

ABOUT THE AUTHOR

...view details