కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 3 రౌండ్ల ఓట్ల లెక్కింపునకు సంబంధించి 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 650 మంది సిబ్బందిని లెక్కింపు కోసం ఉపయోగిస్తున్నారు.
కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు - vote counting started in karimnagar for karimnagar corporation
కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. లెక్కింపు మొత్తం 3 రౌండ్లలో జరగనుండగా.. 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు.
![కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు vote counting started in karimnagar for karimnagar corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5854614-thumbnail-3x2-countinggg.jpg)
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రారంభం
మొదట డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనంతరం ఓట్లను లెక్కిస్తారు. నగర పాలక సంస్థ పరిధిలోని 58 డివిజన్లలో... 366 అభ్యర్థులు బరిలో ఉన్నారు. భద్రత దృష్ట్యా లెక్కింపు కేంద్రాల వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
ఇదీ చదవండిః హైదరాబాద్లో కరోనా కలకలం.. ఫీవర్ ఆస్పత్రిలో వ్యాధి అనుమానితులు
Last Updated : Jan 27, 2020, 12:50 PM IST