పోతిరెడ్డిపాడు అంశాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిందే తెరాస పార్టీ అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు' - ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్
పోతిరెడ్డిపాడు గురించి కాంగ్రెస్, భాజపా మాట్లాడటం చాలా హాస్యస్పదంగా ఉందంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు గురించి ప్రపంచానికి తెలిసేలా చేసిందే తెరాస పార్టీ అని వెల్లడించారు.
!['తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు' vinodkumar-angry-on-congress-and-bjp-leaders-about-potireddypadu-project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7235483-thumbnail-3x2-vinod.jpg)
'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు'
"ఆ కాల్వ వల్ల ఎంత నీరు పోతుంది? దాని సామర్థ్యం ఎంత? అనే అంశాలు వెలుగులోకి తీసుకొచ్చిందే కేసీఆర్. అలాంటింది ఇప్పుడు కాంగ్రెస్, భాజపా పోతిరెడ్డి పాడు గురించి మాట్లాడుతుంటే తాతకు దగ్గు నేర్పినట్లు ఉంది. ఆ కాల్వలు తవ్వించింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే విషయం కాంగ్రెస్ నేతలు గుర్తించుకోవాలి. ఆ జలాలను ఎలా కాపాడుకోవాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బాగా తెలుసు. "
-వినోద్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు
'తాతకి దగ్గడం నేర్పినట్లున్నాయ్ వాళ్ల చేతలు'