తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజన్న ఆలయంలోని ధర్మగుండం పూడిక తొలగింపు - karimnagar

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ధర్మగుండలోని పూడిక తొలగింపు పనులు చేపట్టారు. ఈ పనులలో సుమారు 300 మంది కూలీలు పాల్గొన్నారు.

ధర్మగుండం పూడిక తొలగింపు

By

Published : Apr 26, 2019, 12:31 PM IST

కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలోని ధర్మగుండంలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కొద్దిరోజులుగా ధర్మగుండంలో పేరుకుపోయిన చెత్తతో ఆలయ పరిసరాలన్నీ దుర్వాసన చెలరేగుతుంది. దీనిపై స్పందించిన ఆలయ కమిటీ ధర్మగుండం పరిశుభ్రతకు పూనుకున్నారు. 300 మంది కార్మికులతో చెత్త, పేరుకుపోయిన పూడికను తొలగిస్తున్నారు. భక్తులు స్నానాలు చేసేందుకు ఆలయం యంత్రాంగం నీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు.

ధర్మగుండం పూడిక తొలగింపు

ABOUT THE AUTHOR

...view details