పేదవాడికి ఆఖరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదన్న ఉద్దేశ్యంతో కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మతమేదైనా.. కులమేదైనా వారి ఆచారాల ప్రకారం.. కేవలం ఒక్క రూపాయికే ఆఖరి మజిలీ చేపట్టేలా ప్రణాళిక అమలు చేస్తోంది. అంత్యక్రియల కోసం ప్యాకేజీలతో చేస్తున్న దోపిడీని అరికట్టడమే కాకుండా ఆ కుటుంబాలకు ఉపశమనం కలిగించే విధంగా బృహత్తర కార్యక్రమం చేపట్టింది.
'కేవలం ఒక్క రూపాయికే వైకుంఠథామం' - karimnagar municipal corporation
కేవలం ఒక్క రూపాయికే అంత్యక్రియలతో పాటు వైకుంఠథామంలోనే డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్లు కరీంనగర్ మేయర్ రవిందర్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా నగరంలోని అన్ని వైకుంఠథామాల్లో అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ నడుం బిగించింది.

జూన్ 15 నుంచి పూర్తి స్థాయి కార్యక్రమం :మేయర్
పేదవాడికి చివరి ప్రయాణం ఆర్థికభారం కాకూడదు : మేయర్
ఇవీ చూడండి : 'బాధిత కుటుంబానికి రూ.7లక్షల 5వేల ఆర్థిక సాయం'